టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీడీపీ కోవర్టుగా ఉన్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసిన విషయం రేవంత్కు గుర్తులేదా? అని ప్రశ్నించారు. తన ఇంటికి జగన్ ఎప్పుడూ రాలేదని ఇక కేసీఆర్తో మంతనాలు ఎలా జరుపుతారని రోజా అన్నారు. తన ఇంటికి జగన్ ఎప్పుడు వచ్చారో రేవంత్ చెప్పాలని రోజా అన్నారు. తెలుగుదేశం కోవర్టులా …
Read More »తెలంగాణపై కేంద్రానికి జగన్ పిర్యాదు
తెలంగాణతో నీటి వివాదం విషయంలో.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి నిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా తోడేస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్కు కూడా …
Read More »ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు
ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేశారు. ప్రస్తుత ఆంక్షలు ఈ నెల 7వ తేదీ వరకు అమల్లో ఉండనుండగా.. ఆ తర్వాతి నుంచి ప.గో, తూ.గో జిల్లాల్లో ఉ.6 నుంచి రాత్రి 7 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. గోదావరి జిల్లాల్లో సా.6 గంటలకే షాపులు మూసివేయాలి. మిగతా జిల్లాల్లో ఉ.6 నుంచి రాత్రి 10 వరకు (షాపులు 9కే మూసివేయాలి) సడలింపులు ఇవ్వగా.. పాజిటివిటీ రేటు 5%లోపు వచ్చేంత …
Read More »కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులు-సీఎం కేసీఆర్
కృష్ణా జలాలను వృథా చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని తెలంగాణ రాష్ట్ర సీఎం అన్నారు. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ఏపీ వాడుకోవచ్చని.. తెలంగాణకు కేటాయించిన నీటితోనే విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్.. కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి గోస తీరిందని, రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల వల్ల జల విద్యుత్ అవసరం పెరిగిందన్నారు.
Read More »పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక ప్రాజెక్టు- సీఎం కేసీఆర్
కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. నీటి కేటాయింపులు లేకుండానే ఏపీ ప్రాజెక్టులు కడుతోందని.. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తోందని మండిపడ్డారు. ఎన్జీటీ స్టే విధించినా నిర్మాణాలను ఏపీ ఆపడం లేదని.. ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక ప్రాజెక్టు అని సీఎం తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఒప్పుకునేది లేదన్నారు.
Read More »చుక్క నీటినీ వదులుకోం- ప్రాజెక్టుల్లో కరెంటు ఉత్పత్తినీ ఆపం
కృష్ణా జలాల్లో తమ వాటాకింద వచ్చే జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకొనేది లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. జల విద్యుదుత్పత్తిని కూడా ఆపేదిలేదని స్పష్టంచేసింది. తెలంగాణ హక్కులను కాలరాస్తూ.. ఎలాంటి కేటాయింపులు లేకపోయినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న నేపథ్యంలో గతంలో స్నేహపూర్వకంగా చేసుకున్న అవగాహన ఒప్పందాలు ఇక చెల్లవని.. కృష్ణా జలాల్లో కచ్చితంగా చెరిసగం వాటా వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకొన్నది. తెలంగాణ వ్యవసాయం, రైతుల …
Read More »ఏపీ సీఎం జగన్ పై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 1956 నుంచే తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్నారని వెల్లడించారు. వైఎస్సార్ హయంలో పోతిరెడ్డిపాడు నుంచి 55 వేల క్యూసెక్కుల నీటిని దోపిడీ చేశారని, అప్పట్లోనే తాము వ్యతిరేకించామన్నారు. ఇప్పుడు జగన్ కూడా కృష్ణ జలాలను దోచుకుపోవాలనే దుర్భుద్ధితో వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. నల్లగొండలోని …
Read More »ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇక మహిళా పోలీసు..
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇక నుంచి మహిళా పోలీసులు ప్రత్యక్షం కానున్నారు. ఇన్నాళ్లూ ఈ కార్యాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శి గా ఉన్న వారి పేరు మారిపోతోంది. వారిని మహిళా పోలీసు గా మారుస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా పని చేస్తున్న వారిని మహిళా పోలీసుగా ఆ నోటిఫికేషన్ లో నిర్థారించారు. మహిళా …
Read More »పోతిరెడ్డిపాడు నుండి నీటి దోపిడీ ఆగాల్సిందే..
తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలు కృష్ణా, గోదావరి జలాల సంపూర్ణ వినియోగంతో ముడిపడి ఉన్నాయి. 2020 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం అట్టడుగు నుంచి రోజుకు మూడు టీఎంసీల కృష్ణా జలాలను ఎత్తిపోయడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టింది. వీటివల్ల కృష్ణా నదీజలాల్లో తెలంగాణ న్యాయబద్ధంగా పొందాల్సిన వాటాకు గండి పడే ప్రమాదం ఏర్పడింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి, …
Read More »ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
ఏపీలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2015 సవరించిన పేస్కేలు ప్రకారం మినిమం టైం స్కేలు వర్తింపజేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.. కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు(ఇద్దరు పిల్లలకు) ఇస్తామంది. కాంట్రాక్టు ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తూ/కరోనాతో చనిపోతే కుటుంబ సభ్యులకు 5 లక్షలు, సహజ మరణానికి ౯ 2 లక్షలు ఇస్తారు.
Read More »