Home / NATIONAL / బీజేపీ పార్టీకి బిగ్ షాక్ ..!

బీజేపీ పార్టీకి బిగ్ షాక్ ..!

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది .ఒకపక్క ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొని కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని గవర్నర్ వ్యవస్థను కాల రాస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు గట్టి షాకిచ్చారు .బెంగాల్ లోని జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ దుమ్ము లేపుతుంది .

పంచాయితీ ఎన్నికల్లో టీఎంసీ హావా నిలుపుకుంటుంది .అందులో భాగంగా జిల్లా పరిషత్,పంచాయితీ సమితి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతున్నారు .అయితే బీజేపీ ,కాంగ్రెస్ ,వామపక్షాలు ఏ దశలో కూడా పోటి ఇవ్వడంలేదు .ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం ఎనిమిది వందల ఇరవై ఐదు పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరగగ టీఎంసీ రెండు వందల నలబై స్థానాల్లో విజయం సాధించింది.

ప్రతిపక్షాలు ఇంతవరకు ఖాతా తెరవలేదు.మూడు వేల రెండు వందల పదిహేను గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఒక వెయ్యి యాబై మూడు స్థానాల్లో ,బీజేపీ తొంబై ఒకటి ,లెఫ్ట్ ఎనిమిది ,కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో గెలుపొందాయి .మొత్తం మూడు వందల ముప్పై పంచాయితీ సమితి ఎన్నికలు జరగగ ఇప్పటివరకు టీఎంసీ నూట ఇరవై నాలుగు స్థానాల్లో ఘనవిజయం సాధించి బీజేపీ పార్టీకి బిగ్ షాకిచ్చింది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat