ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ పదకొండో సీజన్లో అతి చెత్త రికార్డును తన పేరిట దక్కించుకున్నాడు .గతంలో మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫిను సొంతం చేసుకున్న ముంబై ఈ ఏడాది మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది .అందులో భాగంగా ఈ సారి కనీసం ప్లే ఆఫ్ లో చోటు కూడా సంపాదించలేకపోయింది .
తద్వారా కెప్టెన్ గా రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.గత ఐపీఎల్ సీజన్లన్నిటిలో మూడు వందలకుపైగా పరుగులను సాధించిన రోహిత్ శర్మ ఈ సీజన్లో మొత్తం పద్నాలుగు మ్యాచ్ ల్లో అతడు చేసిన పరుగులు కేవలం రెండు వందల ఎనబై ఆరు పరుగులు మాత్రమే .అయితే ఐపీఎల్ ప్రారంభమైన దగ్గర నుండి ఇప్పటివరకు రోహిత్ శర్మ ఎప్పుడు ఇంత తక్కువ పరుగులు చేయలేదు ..