తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ సంచలనాలు సృష్టిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొన్న నందమూరి తారకరామారావు ఆఖరి రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా లక్ష్మి స్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించి సంచలనం రేపిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రం ఒక్క ఏపీలో తప్ప అన్నిచోట్ల విడుదల కాగా మంచి హిట్ టాక్ కూడా వచ్చింది.అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితాధారంగా ఓ బయోపిక్ను తెరకెక్కించబోతున్నారు.కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నడిపించారు అన్న నేపథ్యంలో సినిమాని చూపించాబోతున్నారని సమాచారం.
తాజాగా వర్మ ట్విటర్ ద్వారా తెలియజేస్తూ కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేశారు.‘టైగర్ కేసీఆర్’ అని పోస్టర్ లో ఉండగా ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’, ‘ది అగ్రెస్సివ్ గాంధీ’ అన్న క్యాప్షన్లు పోస్టర్లో దర్శనమిచ్చాయి.ఆంధ్ర పాలకుల రాజ్యంలో తెలంగాణ వాసులు పడుతున్న ఇబ్బందులని చూసి తట్టుకోలేక కేసీఆర్ ఏం చేశారన్నది సినిమాలో చూపిస్తామని వర్మ అన్నారు.ప్రస్తుతం వర్మ ‘కోబ్రా’ చిత్రంలో నటిస్తున్నారు.వర్మ ఈ చిత్రంతో తొలిసారి నటుడిగా పరిచయం కాబోతున్నాడు.