ఇటీవల జరిగిన నవ్యాంధ్ర సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. పాల్ కి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ సైట్స్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆయన బయోపిక్ రూపొందించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తుండగా, ఇందులో సునీల్ కేఏపాల్గా నటిస్తాడట. ప్రస్తుతం సునీల్ అమెరికాలో
ఉండగా ఆయనకి హాలీవుడ్ మేకప్ మ్యాన్ మేకొవర్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్, హాలీవుడ్ స్టార్ నటి ఏంజెలీనా జోలీ పాత్రలు కూడా ఉంటాయట. వాటికి సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా జరగుతుందని సమాచారం.
