తెలంగాణ రాష్టంలోని గ్రామ పంచాయతీలలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, సుధీర్ గారు, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేశ్ గారు, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కిషన్ రావు, కలెక్టర్లు ప్రశాంత్ పాటిల్, హరిత పాల్గొన్నారు.
వర్ధన్నపేట శాసనసభ్యులు శ్రీ అరూరి రమేష్ గారి కామెంట్స్…
?తెలంగాణ లోని ప్రతీ పల్లె గ్రామ స్వరాజ్య దిశగా అభివృద్ధి కావాలనే సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు
?మనిషి అనుకుంటే సాధ్యం కానిది ఏది లేదు..మన గ్రామ అభివృద్ధి మన చేతుల్లో నే ఉంది
?14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం.ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఘనత kcr గారిది
?చిన్న జిల్లాల తో అభివృద్ధి సులభం అనే డాక్టర్ అంబెడ్కర్ గారి ఆలోచన మేరకు మన ముఖ్యమంత్రి గారు 33 జిల్లాలను ఏర్పాటు చేశారు
?గతం లో జిల్లా కలెక్టర్ గారిని ఎన్నో కష్టాలు పడే వారు..కానీ ఈరోజు జిల్లా లు ఏర్పాటు అయ్యాక ప్రజలకి కలెక్టర్ లు అందుబాటులో ఉంటున్నారు
? గ్రామాల అభివృద్ధికి చట్టాలను, పథకాలను మన ముఖ్యమంత్రి గారు రూపొందించారు
?ఇంటి ఇంటికి శుద్ధమైన గోదావరి జలాలు వస్తున్నాయి
?అధికారులు కూడా బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు
?ప్రజాప్రతినిధులు కూడా పట్టుదల తో….మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలిసిన అవసరం ఉంది
?పారదర్శకంగా.. రాజకీయాలకు అతీతంగా పరిపాలన సాగుతోంది
?మన రాష్ట్ర పథకాలు దేశంలో మార్గదర్శకంగా నిలుస్తున్నాయి
?మన రాష్ట్రన్ని బంగారు తెలంగాణ చేసే యజ్ఞం లో మనం భాగస్వామ్యులు అవుదాం…
Tags aroori ramesh errabelli dayakar kcr ktr slider telangana telanganacm telanganacmo trs trs governament trswp warangal wardhannapeta mla