ఏపీలోని చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ,మాజీ మంత్రి,ప్రముఖ నటుడు శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో సతమతవుతూ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెల్సిందే.
ఆయనది ప్రేమ వివాహాం. ఆయన వైద్య విద్యనభ్యసిస్తున్న సమయంలో తన క్లాస్ మేట్ అయిన విజయలక్ష్మీతో ప్రేమలో పడ్డారు. ఆమె అప్పటి డీఎస్పీ కుమార్తె. అంతేకాదు ఆమెది పైకులం.
శివప్రసాద్ ది ఆమెది ఒకే కులం కానందున ఆ అమ్మాయిని మరిచిపోవాలని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ వినని శివప్రసాద్ విజయలక్ష్మీని చాలా రహాస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇలా ఉంది వాళ్ల ప్రేమా వివాహాం. ఈ జంట కులాంతర వివాహాలకు ఆదర్శంగా నిలిచారు శివప్రసాద్ .. విజయలక్ష్మీ దంపతులు.