జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సినీమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని ప్రకటించిన సంగతి విదితమే. ఉమ్మడి ఏపీని అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా విభజించిందనే నేపంతో జనసేన పార్టీని స్థాపించాడు పవన్. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చి. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాడు పవన్.
ఆ తర్వాత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా బరిలోకి దిగి కేవలం ఒకటంటే ఒక్కచోట గెలుపొందింది. అఖరికీ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ రెండు చోట్ల బరిలోకి దిగిన కానీ ఒక్క చోట కూడా గెలవలేకపోయాడు. దీంతో వచ్చే ఎన్నికల వరకు పార్టీని నడపాలంటే ఆర్థికంగా స్థోమత కావాలి కాబట్టి కొన్ని సినిమాల్లో నటిస్తానని ప్రకటించాడు పవన్.
సినిమాల్లోకి రీఎంట్రీవ్వాలని ఆశతో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక ప్రముఖ దర్శకుడు మెప్పించాడంటా. ఇటీవలే ఆయన పవన్ కు కథ చెప్పి మెప్పించాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.హిందీలో బిగ్ బి అమితాబ్ నటించిన పింక్ మూవీ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి చాలా రోజులుగా సరైన హిట్ లేక కష్టాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కు “గబ్బర్ సింగ్”మూవీతో అదిరిపోయే హిట్ నందించిన హారీష్ శంకరే దర్శకత్వం వహించనున్నారని టాక్.
వచ్చే సంక్రాంతికి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు అనే ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీ తర్వాత నటించిన చిత్రాలన్నీ డిజార్ట్ గా నిలిచిన సంగతి విదితమే. దీంతో అప్పుడు బంపర్ హిట్ ఇచ్చిన హారీష్ శంకర్ తాజా లేటెస్ట్ మూవీకి దర్శకత్వం వహించనున్నారు అనే వార్తల్లో నిజముందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.