కళ్యాణ్..జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్య పట్ల వైసీపీ శ్రేణులు అంతా ఆగ్రహిస్తున్నారు. పవన్ మాట్లాడుతూ అసలు వైసీపీ ఎంత.? 151 మంది ఎమ్మెల్యేలు ఎంత.? మీరెంత.? మీ బతుకెంత.? అని ప్రశ్నించారు.. అయితే పవన్ కళ్యాణ్ తాను ఎమ్మెల్యేగా గెలవలేని ఇప్పటికీ ఆ కోపం అక్కసుతో ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదనిపిస్తోంది. ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రెండు చోట్లా పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోవడం.. 175 స్థానాలకు మిత్ర పక్షాలతో కలిసి రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ 130 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం గత ఎన్నికల్లో చూశాం.
పదేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చిన అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో పవన్కళ్యాణ్ హడావిడి చేసి వెళ్లిపోయారు. అనంతరం జనసేన స్థాపించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఊరువాడ ప్రచారం చేశారు. టిడిపి గెలిచిన తర్వాత టీడీపీ ఇచ్చిన ప్రతి హామీకి నాది హామీ అంటూ ప్రజలకు ఇచ్చిన హామీని మర్చిపోయారు. ఎప్పుడు ఒక సంస్థాగత నిర్ణయాన్ని పవన్ తీసుకోలేకపోయారు ప్రజల వైపు ఉండలేకపోయారు. తాను ఎంత గట్టిగా అరిచినా తాను ఎన్ని స్పీచ్ లు ఇచ్చినా కేవలం 2% ఓట్లతో సరి పెట్టారంటే అది పవన్ కళ్యాణ్ స్టామినా. ముఖ్యంగా ఒకే జిల్లాలో నరసాపురం లో నాగబాబు ఎంపీగా గతంలో చిరంజీవి పాలకొల్లులో ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోవడం అం రికార్డ్ గా ఫీల్ అవుతున్నారు అనుకుంటా అందుకని పవన్ ఇలా మాట్లాడుతున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు.