మహారాష్ట్ర రాజకీయాలు రోజుకు ఎన్నో మలుపులు తిరుగుతూ తాజాగా బీజేపీ,ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఈ సస్పెన్స్ కు తెర పడింది. మహా ముఖ్యమంత్రిగా దేవేంద్ర పడ్నవీస్ ,ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ల చేత ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు భగత్ సింగ్ కోషియార్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ముగిసింది.
అయితే మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తనయుడు అధిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవీ దక్కకపోవడానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడే కారణమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబును శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే,అధిత్య ఠాక్రే కలిసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ” చంద్రబాబు పాదం మహిమ .
ఇరవై మూడో తారీఖునే శివసేనకు అధికారం దూరమయింది. బాబుకు ఇరవై మూడుకు చాలా సంబంధం ఉంది. అందుకే బాబును కలవడం వలనే ఇరవై మూడో తారీఖునే శివసేనకు అధికారం దక్కలేదు. బాబును కలవకపోతే శివసేన అధికారంలోకి వచ్చేది. అధిత్య ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యేవాడు”అని పోస్టులు చేస్తూ బాబును ట్రోల్ చేస్తోన్నారు నెటిజన్లు.