Home / ANDHRAPRADESH / అమరావతిలో చంద్రబాబుకు నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ దళిత రైతుల ఆందోళన…వీడియో..!

అమరావతిలో చంద్రబాబుకు నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ దళిత రైతుల ఆందోళన…వీడియో..!

అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. బాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ను అడ్డుకుంటూ..గో బ్యాక్ అంటూ దళిత రైతులు నినదిస్తున్నారు. 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రాజధానిలోని అసైన్డ్ భూముల రైతులు, లంక భూముల రైతులకు అన్యాయం చేస్తూ..జీవో నెం.41 జారీ చేసినందుకుగాను..గో బ్యాక్ బాబూ అంటూ బ్యానర్లతో చంద్రబాబుకు రైతన్నలు నిరసిన తెలిపారు. చంద్రబాబు రాజధాని రైతు కూలీలకు 365 రోజుల ఉపాధి హామీ ఏమైంది…రాజధాని రైతులకు మీరు ఇస్తారన్న ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి..? చంద్రబాబు గ్రామకంఠకాల సమస్యను ఎందుకు పరిష్కరించలేదు..? అంటూ పోస్టర్లు ప్రదర్శిస్తూ చంద్రబాబును నిలదీసారు. అయితే ఆందోళన చేస్తున్న రైతులపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రికత్త ఏర్పడింది. చంద్రబాబు గో బ్యాక్ అంటూ రైతులు నినదిస్తుండగా..టీడీపీ కార్యకర్తలు జై బాబు అంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఇరు వర్గాలను అదుపులో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బాబు పర్యటన నేపథ్యంలో అమరావతిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబుకు కావల్సింది అదే..ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో పర్యటించి..తన పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి…పథకం ప్రకారం దాడులు చేయించి..అదిగో రాజధానిలో అల్లకల్లోలం చెలరేగుతుందంటూ ఎల్లోమీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా ప్రసారం చేయించి..రాజకీయ లబ్దికి ప్రయత్నించడం చంద్రబాబుకు అలవాటే. అయితే పోలీసులు సంయమనంతో ఎక్కడా అల్లర్లు, దాడులు జరుగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

అమరావతిలో చంద్రబాబుకు నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ దళిత రైతుల ఆందోళన….!

అమరావతిలో చంద్రబాబుకు నిరసన సెగ..గో బ్యాక్ అంటూ దళిత రైతుల ఆందోళన….! #dharuvutv

Posted by Dharuvu on Wednesday, 27 November 2019

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat