వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మరియు తనయుడు లోకేష్ పై ఒకేసారి కౌంటర్ ఎటాక్ చేసాడు. రాయలసీమలో మూడొంతులు పూర్తయిన ప్రాజెక్టులను వదిలేసి కమిషన్ల కోసం కొత్త పనులు చేపట్టాడు చంద్రబాబు గారు. కిరసనాయిలు వాటాగా కొన్ని పనులను 100 నుంచి 200 శాతం అంచనాలు పెంచి ఒక రాజ్యసభ సభ్యుడికి కట్టబెట్టాడు. ఇవన్నీ ప్రజలకు తెలిసే రెండు సీట్లకు పరిమితం చేసి గుణపాఠం చెప్పారు అని అన్నారు. మరోపక్క ఇంకో ట్వీట్ లో లోకేష్ ని ఫుల్ గా ఆడుకున్నారు. “వర్ధంతికి, జయంతికి తేడా తెలియకుండా మాట్లాడితే మీరన్నట్టు ప్రాజెక్టులేమీ ఆగిపోవు చిట్టి నాయుడు? ఇంత జ్ఞాని మనకు మంత్రిగా పనిచేశాడా అని ప్రజల మనసులు క్షోభించాయి. విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి కేవలం చంద్రబాబు కొడుకు అవడం వల్లనే ఎమ్మెల్సీ, మంత్రి అయ్యాడని అందరి అభిప్రాయం” అని అన్నారు.