పవర్ స్టార్ పవన్కల్యాణ్కు, స్టైలిష్స్టార్ అల్లు అర్జున్కు మనస్పర్థలు ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..గతంలో ఆడియో ఫంక్షన్లో పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్న పవన్ ఫ్యాన్స్తో చెప్పను బ్రదర్ అంటూ వివాదం రేపిన అల్లుగారబ్బాయి…తాజాగా అలవైకుంఠపురం ఫంక్షన్లో కూడా తన కట్టె కాలేంతవరకు చిరంజీవి ఫ్యాన్గా ఉంటానని, చిరు తర్వాత అంతగా అభిమానించేది రజనీకాంత్ అంటూ చెప్పి పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. అయితే అలవైకుంఠపురం సిన్మా సక్సెస్ సందర్భంగా పవన్ కల్యాణ్ స్వయంగా అల్లు అర్జున్కు విషెస్ చెప్పడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అల్లు అర్జున్కు అభినందనలు తెలుపుతూ..పూలబొకే పంపిన పవన్ స్వయంగా లెటర్ రాశారు.. ఆ లెటర్లో అల్లు అర్జున్ను గారు అని పవన్ సంబోధించడం చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ పవన్ ఆ లెటర్లో ఏం రాశాడంటే.. ”గౌరవనీయులైన అల్లు అర్జున్ గారూ.. ‘అల.. వైకుంఠపురములో’ ఘన విజయం సాధించిన సందర్భంగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. భవిష్యత్లో మీ ప్రాజెక్ట్స్ మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్” అంటూ బన్నీకి అభినందనలు తెలిపారు. అయితే ఈ విషయాన్ని బన్నీ ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు. `పవన్ కళ్యాణ్ గారి నుంచి శుభాకాంక్షలు రావటం ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ గారు` అంటూ ట్వీట్ పెట్టారు. దీంతో ఈ మామాఅల్లుళ్ళ మధ్య జరిగిన ఈ సంభాషణపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తనను లెక్క చేయలేనంతగా పెద్దవాడు అయ్యాడనే భావనతోనే బన్నీని పవన్ వెటకారంగా అల్లు అర్జున్ గారు అని సంబోధించాడని ఫ్యాన్స్ మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు పవన్ కావాలనే తనను గారు అని వెటకారం ఆడానని..అందుకే బన్నీ కూడా పవన్ కల్యాణ్ గారూ అని రిప్లై ఇచ్చాడని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తంగా అలవైకుంఠపురం సక్సెస్ సందర్భంగా పవన్, బన్నీలు ఒకరినొకరు పొగుడుకున్నారా..తిట్టుకున్నారా..అంటూ టాలీవుడ్లో చర్చ జరుగుతోంది.