Home / ANDHRAPRADESH / అవినీతి మా ఇంట వంట లేదు-లోకేష్ నాయుడు

అవినీతి మా ఇంట వంట లేదు-లోకేష్ నాయుడు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఐటీ దాడులపై స్పందిస్తూ” రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లే ఉంది అని ఆయన ట్వీట్ చేశారు.

ఇంకా ఆయన లోకంలో పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కన్పించినట్లు ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి అతని బ్యాచ్ కు అందరూ అవినీతి చేసినట్లు కన్పిస్తున్నారని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం నలబై చోట్ల ఐటీ దాడులు నిర్వహిస్తే రూ.85లక్షలు దొరికాయని ఆయన అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో రెండు వేల కోట్ల అవినీతి సొమ్ము దొరికిందని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ఐటీ దాడులకు టీడీపీని భయపెట్టాలని చూస్తున్నారు. ఐటీ దాడుల్లో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు వారు ఇచ్చిన పత్రిక ప్రకటన బట్టి అర్ధమవుతుంది అని ఆయన అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat