Home / SLIDER / 77కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు : ఈటల

77కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు : ఈటల

కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రస్తుతం 77కు  చేరుకుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కరోనా తాజా పరిస్థితిపై మంత్రి మాట్లాడుతూ.. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌లో మత ప్రార్థనలకు హాజరై రాష్ర్టానికి వచ్చిన వారందరూ గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు.

మర్కజ్‌ నుంచి వచ్చినవారు, వారి బంధువుల్లో 15 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు.
కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నవారు వారి బంధువులను కూడా పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకురావాలన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.

ప్రజలు ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరారు. డయాలసిస్‌, తలసేమియా, సికెల్‌సెల్‌ జబ్బులున్న వారికి రక్త మార్పిడి అవసరమవుతుంది. కావునా వీరు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం ఆదేశానుసారం ఇటువంటి జబ్బులున్నవారి ప్రయాణాన్ని పోలీసులు అడ్డుకోవద్దన్నారు. అదేవిధంగా గర్బిణీలకు ఇబ్బందులు లేకుండా మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌ సెంటర్లు పని చేస్తాయని మంత్రి వెల్లడించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat