టీమండియా మాజీ కెప్టెన్.. లెజెండరీ ఆటగాడు.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజంభిస్తున్న సంగతి విదితమే.
ఈ క్రమంలో గత పన్నెండు రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది .దీంతో ఇస్కాన్ లో దాదాపు పదివేల మందికి రెండు పూటల లాక్ డౌన్ ముగిసేవరకు భోజనం పెట్టడానికి దాదా ముందుకొచ్చాడు .దీనికి అవసరమైన మొత్తం యాభై లక్ష రూపాయల ను విరాళంగా ఇచ్చారు .
దాదా చేసిన సాయం పై ఇస్కాన్ హర్షం వ్యక్తం చేసింది. అయితే గంగూలీ సారథ్యంలో ఇస్కాన్ బృందం సుదీర్ఘ టెస్ట్ మ్యాచ్ అడనున్నది అని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు కామెంట్లు పెడుతున్నారు.