ప్రముఖ దర్శకుడు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంతల కాంబోలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సీఫీస్ రికార్డులను చెరిపివేస్తూ అదే స్థాయిలో వసూళ్లను రాబడుతూ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే, రంగస్థలం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ అంతా ఫుల్ కుషీలో ఉంది. దీంతో ఆ చిత్ర నిర్మాణ సంస్థ రంగస్థలం సీక్వెల్ తీసేందుకు సిద్ధమైందట. అనుకున్నదే తడవుగా ఈ విషయాన్ని మైత్రీ మూవీస్ సంస్థ యాజమాన్యం సుకుమార్కు చెప్పడంతో.. అందుకు సుకుమార్ కూడా కథ రెడీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
see also : చంద్రబాబుపై ప్రముఖ సినీ నటి సంచలన వ్యాఖ్యలు..!!
అయితే, రంగస్థలం సీక్వెల్లో హీరో రామ్ చరణ్ క్యారెక్టర్ కాస్త డిఫరెంట్గా డిజైన్ చేసే పనిలో పడ్డాడట సుకుమార్. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్వింపబడుతున్న రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్కు చెవులు వినపడవు కాబట్టి.. సీక్వెల్లో రామ్చరణ్కు ఆపరేషన్ చేసి చెవులు వినపడేట్టు చేసేలా సుకుమార్ కథను సిద్ధం చేస్తున్నారు. అయితే, గ్రామీణ పొలిటికల్ను రంగస్థలం చిత్రంతో తెరపై అచ్చుగుద్దినట్టు చూపించిన సుకుమార్, రంగస్థలం సీక్వెల్లో ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో వేచి చూడాలి మరీ..!!