Home / ANDHRAPRADESH / కృష్ణా టీడీపీలో గందరగోళం ..పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే గుడ్ బై

కృష్ణా టీడీపీలో గందరగోళం ..పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే గుడ్ బై

ఏపీలో కృష్ణా జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకుంది .అందులో భాగంగా జిల్లాలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె ఏపీలో కృష్ణా జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకుంది .అందులో భాగంగా జిల్లాలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె
రామ్మోహన్ ,తెలుగు యువత నాయకుడు దేవినేని అవినాష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి .అందులో భాగంగా గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య భేధాభిప్రాయాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నయి .

ఈ నేపథ్యంలో తనకు ఎప్పటి నుండో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు అండదండలు చూసుకొని అవినాష్ సీనియర్ నేత ,ఎమ్మెల్యే అయిన గద్దె రామ్మోహన్ వర్గానికి చెక్ పెడుతూ వస్తున్నాడు.ఇటివల జరిగిన పలు ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకి స్థానిక ఎమ్మెల్యే అయిన రామ్మోహన్ ను పిలవకుండా మొక్కుబడిగా ఆహ్వానాలను అందించడంతో వీరిద్దరి మధ్య ఉన్న నిప్పు ఇప్పుడు భగ్గుమంది .అయితే రానున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో అరవై శాతం మందికి ఇవ్వను అని తేల్చేసిన చంద్రబాబు తీరుతో విసిగిచేంది ఉన్న గద్దెకు స్థానికంగా దేవినేని అవినాష్ వ్యవహార శైలీ ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పాలనే యోచనలో పడేశాయి  .

ఆది నుండి దమ్మున్న నేత కావడం ..ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉండటం వలన టీడీపీలో ఉండి నిన్న కాక మొన్న వచ్చిన యువనేత అరాచకాలను భరించే కంటే వైసీపీలో చేరడం మంచిదని ఇప్పటికే గద్దె అనుచరులు తెగేసి చెప్పారు అంట .దీంతో రానున్న కాలంలో గద్దె టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు అంట .అందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యే కొడాలి నాని ,మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను కలిశారు అంట గద్దె .అయితే ఇప్పటికే గద్దె చేరికకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో హాల్ చల్ చేస్తున్నాయి .చూడాలి మరి గద్దె సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు ఎప్పుడు వస్తాడో ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat