ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీలపై ఆయా పార్టీల ప్రధాన నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీకి వస్తుంటే అన్యాయంగా కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని విభజించారని ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని చూడటానికి వస్తారు.. అని ప్రశ్నించారు.. మళ్లీ అదే చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తుంటే ప్రత్యేకహోదా ఇవ్వని మోడీ రాష్ట్రానికి ఏ ముఖం పెట్టుకుని వస్తారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.
అలాగే ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టింది. నల్ల జెండాలు, బెలూన్లు, ఖాళీ కుండలతో నిరసన తెలుపుతున్నారు. అయితే ఇదే చంద్రబాబు ప్రత్యేకహోదా ఏమైనా సంజీవనా హోదా వస్తే ఏం వస్తుంది.. హోదా అంటే జైలుకే అంటూ మాట్లాడారు. ప్రస్తుతం హోదాపై మోడిపై చేస్తున్న విమర్శలు చూస్తున్న ఏపీ ప్రజలు చంద్రబాబూ.. అసలు నీది నోరా తాటిమట్టా అని ప్రశ్నిస్తున్నారు.