వైసీపీలోకి టీడీపీ నేతలు క్యూ కట్టడం వెనుక అసలు కారణాలు బయటపడ్డాయి..రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి సైకిల్ నిలబడదని తెలుస్తుంది.భారీ అంచనాలు లేకపోయినా ఎలాగైన గెలవాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు.ఇలాంటి సమయంలో బాబు అందరికి ఒక వార్త చెప్పారు.ఆ వార్త విన్నవారంత తట్టా బుట్టా సర్దుకొని జంప్ అవుతున్నారు.ఆ వార్త ఏమిటీ అనుకుంటున్నారా.. చంద్రబాబు ఏకైక కుమారుడైన నారా లోకేష్ను రానున్న ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారట.ఈ వార్త విన్న తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారట.ఇదేమిటని ప్రశ్నిస్తే నేను చెప్పిందే వేదం అన్నటుగ్గా చెప్పారట.
లోకేష్కు ఎన్నికల్లో డైరెక్ట్ గా గెలిచే సత్తా లేకనే ఎమ్మెల్సీ చేసి మరి మంత్రి పదవి ఇచ్చారు..ఇప్పుడు సీఎం అనేసరికి తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికే గెలవడం కష్టం అనుకుంటే..ఇప్పుడు లోకేష్ ను నిలబెడితే వైసీపీకి వార్ వన్ సైడ్ అయిపోతుంది కొట్టుమిట్టాడుతున్నారు టీడీపీ నేతలు.వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ఒకేసారి 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు జంప్ అవుతారని ఒక రిపోర్ట్ చంద్రబాబుకు అందినట్టు సమాచారం.ఇన్ని జరుగుతున్న చంద్రబాబు మాత్రం ఒక్క మెట్టు కూడా దిగడంలేదట..ఒకరు పోతే వంద మంది నాయకులను తయారు చేస్తా తప్ప నా మాట మాత్రం మారదు 2019 ముఖ్యమంత్రి అభ్యర్థి లోకేష్ బాబే అని సీనియర్ నేతలకు చెప్పుకొచ్చారట.ఇక మునుముందు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.