Home / SLIDER / ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పోచంపల్లి..

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పోచంపల్లి..

తెలంగాణలో ఈ నెలలో జరగనున్న వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,స్థానిక మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ బాస్కర్ ,చల్ల దర్మారెడ్డి ,ఎంపీలు పసునూరి దయాకర్,రాజ్యసభ ఎంపి బండా ప్రకాశ్, వికాలంగుల కార్పొరేషన్ చైర్మన్ డా కే వాసుదేవా రెడ్డిలతో కలిసి నామినేషన్ ధాఖలు చేశారు.

విలేకరులతో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూఎన్నికలు అంటేనే కాంగ్రెస్ కు వణుకు పుడుతోందని, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిందని.. ఎన్నికలు ఏవైనా విజయం టిఆర్ఎస్ పార్టీదేనని అన్నారు.ఓటమి భయంతో రాష్ట్రంలో ప్రతి ఎన్నికలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తుందని విమర్శించారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ.. అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోతున్నారని ఆయన ఆరోపించారు.ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ని అత్యధిక మెజార్టీ తో గెలిపించి, బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనకు సహాకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

అంతకు ముందు భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పోచంపల్లి, అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్ లు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రొ.జయశంకర్, ప్రజాకవి కాళోజి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat