ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. ఒకానోక సమయంలో ఎంపీ అభ్యర్థులుగా పోటి చేయడానికి సిట్టింగ్ ఎంపీలు సైతం భయపడి పోటీలోకి దిగలేదు. అంతకుముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున నూట డెబ్బై ఐదు మంది బరిలోకి దిగితే కేవలం ఇరవై మూడు మంది మాత్రమే గెలుపోందారు. మిగిలినవారిలో చాలా మంది మంత్రులు,హేమాహేమీలు సైతం ఓడిపోయారు.
ఈ క్రమంలో టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు అవినీతి అక్రమాలు,తెలుగు తమ్ముళ్ళు భూకబ్జాలు,రాజధాని నిర్మించకపోవడం,ప్రత్యేక హోదా సాధించకపోవడం.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హమీలల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోవడం ఇలా పలు కారణాలతో టీడీపీ ఓటమి పాలైంది. అయితే మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓటమిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యమైన నేతలతో పాటు ఓడిపోయిన ఎమ్మెల్యే ,ఎంపీ అభ్యర్థులందరూ హాజరయ్యారు. ఈ క్ర్తమంలో “తమ ఓటమికి మన స్వయంకృతపరాదం అయితే ఎన్నికలకు ముందు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను తో సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు చేయకపోయిన కానీ చేసినట్లు చూపించిన గ్రాఫిక్స్ ప్రకటనల వీడియోలు “ముఖ్యకారణమని తెలుగు తమ్ముళ్ళు బాబు దగ్గర వాపోయారంటా.. బోయపాటి శ్రీను తీస్తే సినిమాల్లో ఆదరిస్తారు కానీ వాస్తవాలను దాచి అసత్యాలను వాస్తవాలుగా చిత్రీకరించి జనాల్లోకి వదిలితే మనల్ని బొందపెట్టారు. బోయపాటి మన కొంప ముంచాడని తెలుగు తమ్ముళ్ళు వాపోయారు అంట..