ఢిల్లీలో చక్రం తిప్పుతానని ప్రకటించి ఏపీలో ఘోర పరాజయం పాలైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురించి జాతీయ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేని విధంగా చంద్రబాబు నాయకత్వంలో ఈ దారుణ ఓటమి ఓ వైపు ఉండగా…మరోవైపు జాతీయ నేతలతో ఇటీవల హడావుడి చేసిన చంద్రబాబు ఇప్పుడు వారి వద్ద మొహం చూపెట్టుకోలేని స్థితికి చేరిపోయారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్ల ఢిల్లీ వేదికగా చంద్రబాబు నాయుడు మొహం చూపించుకోలేని స్థితికి చేరారని అంటున్నారు.
జమిలి ఎన్నికల నిర్వహణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ కార్యదర్శి డీ రాజా, బీహార్ సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్కుమార్, అకాలీదళ్ నేత సుఖ్బీర్సింగ్ బాదల్, ఒడిశా సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్, ఎన్పీపీ నాయకుడు కాన్రాడ్ సంగ్మా హాజరయ్యారు. పార్లమెంట్ భవనంలోని గ్రంథాలయ భవనంలో జరిగిన ఈ భేటీలో పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు.
అయితే, ఈ సమావేశానికి చంద్రబాబు మొహం చాటేశారు. తాను విదేశాలకు వెళుతున్నానని పేర్కొన్న బాబు కనీసం తన ప్రతినిధిని సైతం పంపించలేదు. మరోవైపు , ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ తన వాదనను అత్యంత సమర్థంగా వినిపించారని పలువురు అంటున్నారు. మీడియాలో హడావుడి చేయడం మినహా..చంద్రబాబు చేసేది ఏమీ లేదని పలువురు నేతలు ఈ సందర్భంగా చర్చించుకున్నట్లు పేర్కొంటున్నారు.