టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక ఊపు ఊపిన అందాల భామ సమీరారెడ్డి.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమ్మడు తాజాగా నీటి అడుగున ఫోటోలు దిగి సంచలనం సృష్టించింది. 9 నెలల గర్భిణీ అయినప్పటికీ ఆమె ఎంతో ధైర్యం చేసి ఫోటోషూట్లో పాల్గొన్నది. అండర్ వాటర్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. తొమ్మిదో నెలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని.. దాని కోసమే ఇలా ఫోటోలను దిగిందట సమీరా రెడ్డి. మనం ఎప్పుడైతే భయపడతామో.. అలసిపోతామో.. ఎగ్జయిట్ అవుతామో.. అవే మనకు జ్ఞాపకాలుగా మిగులుతాయి. వాటినే మనం పదిలంగా దాచుకోవాలి.. అంటూ సమీరా రెడ్డి క్యాప్సన్ పెట్టింది. సమీరా రెడ్డి బిజినెస్మ్యాన్ అక్షయ్ వర్దేను పెళ్లిచేసుకుంది. వాళ్లకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు కూడా.