ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అధికారంలో ఉన్న టీడీపీ కనీస సీట్లు కూడా గెలుచుకోలేపాయింది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఒక పరంగా ఓటమి అంచులవరకు వచ్చి గెలిచాడనే చెప్పాలి.ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చంద్రబాబు తనయుడు లోకేష్ వైసీపీ పార్టీ పై ట్వీట్ లు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు.”లోకేశ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేమో జాకీలు పెట్టి లేపుతున్నారు. తండ్రి సైగ చేసి ఉంటారు. కొత్త ప్రభుత్వం వచ్చి 5 వారాలే అయిందన్న సృహ కూడా లేకుండా ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నాడు. సీఎం కొడుకు, మంత్రి అయిఉండి మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్ చెల్లని కాసు అయిపోయాడు” అని ట్వీట్ చేసాడు.
లోకేశ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేమో జాకీలు పెట్టి లేపుతున్నారు. తండ్రి సైగ చేసి ఉంటారు. కొత్త ప్రభుత్వం వచ్చి 5 వారాలే అయిందన్న సృహ కూడా లేకుండా ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నాడు. సీఎం కొడుకు, మంత్రి అయిఉండి మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్ చెల్లని కాసు అయిపోయాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 6, 2019