Home / INTERNATIONAL / లండన్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

లండన్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఎన్నారైల తెరాస యూకే ఆద్వర్యంలో లండన్ లో టి.ఆర్.యస్ కార్యనిర్వాహణ అధ్యక్షుడు మాజీ మంత్రి శ్రీ. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలని లండన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి హాజరయ్యారు. కార్యవర్గ సభ్యులంతా కలిసి ముందుగా కేక్ కట్ చేసి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు.
 
ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, ముందుగా కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపి వారు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో చేసుకోవాలని, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ పార్టీని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లని కోరారు. కేటీఆర్ గారు తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రమంతటా నూతన ఉత్తేజం వచ్చిందని క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజలు తెరాస వైపు చూస్తున్నారని, ఇటీవల ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వస్తున్న స్పందనే దానికి నిదర్శనమని తెలిపారు.కేటీఆర్ గారి పిలుపు మేరకు “గిఫ్ట్ ఏ స్మైల్” లో భాగంగా మా సొంత గ్రామం పోచారం లో ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతుల ఉండేలా వ్యక్తిగత ఖర్చుతో పనులు చేయించడానికి శ్రీకారం చుట్టామని, ఇక ఎవరు కూడా ప్రైవేట్ పాఠశాలలకి వెళ్లకుండా, కేవలం ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే లాగ తీర్చిదిద్దుతామని తెలిపారు. కేటీఆర్ గారు నాడు మంత్రిగా, నేడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్రానికి చేస్తున్న సేవ చాలా గొప్పదని, మనంత ఎల్లపుడు వారి వెంటే ఉండి వారి నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు.
 
చివరిగా కార్యక్రమానికి వచ్చిన కార్యవర్గసభ్యులకి స్థానిక ప్రవాసులకి కృతఙతలు తెలిపారు. ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, కేటీఆర్ గారికి ఎన్నారై తెరాస పక్షాన యావత్ ఎన్నారైల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కేటీఆర్ గారు గతంలో మంత్రిగా ఉండి దేశానికే ఆదర్శంగా నిలిచారని, ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం అసూయ పడే విధంగా తన బాధ్యతలు నిర్వహించారని, ఇలాంటి మంత్రి మాకుంటే బాగుండు అని నాతోనే ఇతర రాష్ట్రాల ప్రవాసులు అన్నారని తెలిపారు.ఇలా మేమంతా గర్వపడేలా ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడు తెలంగాణ లో ఉండడం మన అందరి అదృష్టమని, వారి పిలుపు మేరకు కేవలం వేడుకలకు మాత్రమే పరిమితం కాకుండా స్థానికంగా మరియు తెలంగాణ రాష్ట్రం లో వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా హాజరై అన్ని సందర్భాలలో ప్రోత్సహాన్ని అందిస్తున్న ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి గారికి కృతఙ్ఞతలు తెలిపారు.
 
ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ యుకే ఆధ్యక్షుడు అశోక్ దూసరి మాట్లాడుతూ రాష్ట్ర పురోభివృద్దిలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ పురోభివృద్ది కృషి చేసి దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి దిశగా తీసుకువచ్చారని కొనియాడారు. కేటీఆర్‌ను యువతరం ఆదర్శంగా తీసుకుంటోందన్నారు.ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణానికి కేటీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. తెలంగాణకు ఐటీ కంపెనీలు తెచ్చేందుకు కేటీఆర్‌ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు.
 
ఈ కార్యక్రమంలో ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి, అడ్వైసరి బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శులు సత్య చిలుముల మరియు సృజన్ రెడ్డి, జాగృతి రాష్ట్ర నాయకులు రోహిత్ రావు, ముఖ్య నాయకులు రవి రేతినేని, శ్రీకాంత్ జెల్లా, సురేష్ బుడగం, గణేష్ పస్తం మరియు స్థానికులు నరేందర్, వాసు, రంజిత్ పాల్గొన్న వారిలో ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat