ఏపీ అసెంబ్లీలో భాగంగా ఈరోజు కూడా ఎదావిదిగా సభ మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ నేతలు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఇప్పటికే చంద్రబాబు చేసిన దొంగ ప్రచారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపధ్యంలో తన పరువు పోతుందని బాబూ ఏదోక సాకుతో సభని గందరగోళానికి గురిచేస్తున్నారు. అలాంటి పనులు చేయడంతో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు సస్పెండ్ అయిన బాబుకి బుద్ధి రాలేదనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే బందర్ పోర్ట్ విషయంలో చంద్రబాబు చేస్తున్న అసత్యపు ట్వీట్ల పై అంబటి రాంబాబు స్పందించారు.
చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి అంటే దున్నపోతు ఈనింది అంటే కట్టేయమని చెప్పండి అన్నట్లుగా ఉన్నాయని అన్నారు. బందర్ పోర్ట్ విషయంలో చాలా తప్పుగా మాట్లాడ్తున్నారని, మీరు ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలని చాలా పట్టుదలతో ప్రయత్నిస్తున్నారని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతీది మేము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నాం దాని ప్రకారమే ముందుకు వెళ్తున్నామని, దీనిపై ప్రజా ఆదరణ కూడా మంచిగా ఉందని అన్నారు. ప్రభుత్వం బందరు పోర్టు విషయంలో చిత్తశుద్ధితో ఉందిని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహితంగా మాట్లాడే మాటలను వక్రీకరించి చూపించే ప్రయత్నం మానుకోవాలని గట్టిగా చెప్పారు.