నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అమెరికా వెళ్లడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేష్ తప్పుపడుతున్నారు. సొంత పనులలో జగన్ బిజీ గా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.దేశం అంతటా వరదలతో కష్టాలు,నష్టాలు వస్తే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేగంగా స్పందించారని, బాధితులను ఆదుకున్నారని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం అక్కరకు రాని చుట్టంలా అమెరికాలో సొంత పనుల్లో యమ బిజీగా ఉన్నారని ఆయన సెటైరికల్ గా అన్నారు.‘‘నోటి పారుదల మంత్రిగారు నోరు తెరిస్తే అబద్ధాలు. మొన్న తప్పుడు లెక్కలతో తడబడ్డారు. ఇప్పుడు విషయంపై అవగాహన లేక, నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బొక్కబోర్లా పడ్డారు’’ అని ఇంకో ట్వీట్ లో పేర్కొన్నారు.
