గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులతో వీడియోలు చేయిస్తూ సీఎం జగన్ను, వైసీపీ మంత్రులను కించపర్చేలా చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా కుట్ర ఎట్టకేలకు బట్టబయలైంది. తమ జూనియర్ ఆర్టిస్టులతో రైతు, వరద బాధితుల అవతారాలు ఎత్తించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీకి చుక్కెదురు అయింది. తాజాగా వైఎస్ జగన్ సర్కార్పై బురద చల్లడమే కాకుండా, పలువురు మంత్రులను కులం పేరుతో దూషించిన నలుగురు పెయిడ్ ఆర్టిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం అయిందంటూ ఆర్టిస్టులతో ప్రచారం చేయించింది. వీరంతా మంత్రిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర భాషలో, అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేసి, ఐపీసీ సెక్షన్ 120 B కింద (కుట్రపూరిత) కేసు నమోదు చేశారు.దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి పప్పు గారిపై విరుచుకుపడ్డారు. చివరకు టీడీపీ సోషల్ మీడియాలో కూడా లోకేశ్ అట్టర్ ఫ్లాప్. పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ గారి ప్రభుత్వాన్ని కించపర్చే ప్రయత్నంలో అడ్డంగా దొరికి పోయాడు. చేపల పడవను అడ్డం పెట్టి తమ కరకట్ట నివాసాన్ని ముంచారని కామెంట్ చేసి పరువు తీసుకున్నాడు. ఇంకా ఎన్ని వింతలు చేస్తాడో? అని ట్వీట్ చేసారు.
చివరకు టీడీపీ సోషల్ మీడియాలో కూడా లోకేశ్ అట్టర్ ఫ్లాప్. పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ గారి ప్రభుత్వాన్ని కించపర్చే ప్రయత్నంలో అడ్డంగా దొరికి పోయాడు. చేపల పడవను అడ్డం పెట్టి తమ కరకట్ట నివాసాన్ని ముంచారని కామెంట్ చేసి పరువు తీసుకున్నాడు. ఇంకా ఎన్ని వింతలు చేస్తాడో?
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 26, 2019