టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛలో ఆత్మకూరు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పేరుతో పల్నాడులో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని హై టెన్షన్ కు తీసుకురావాలని వారు నిర్ణయించుకున్నారు. దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో అని కనీసం ఆలోచించడం లేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా అని అన్నారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులున్నాయని రచ్చ చేసి కొత్త పరిశ్రమలు రాకుండా చంద్రబాబు దొంగల ముఠా కుట్రలు మొదలు పెట్టింది. పల్నాడులో ఐదేళ్లు రౌడీ రాజ్యమేలింది. ప్రశాంతత నెలకొనడం బాబుకు ఇష్టం లేదని అర్థమవుతోందని చెప్పారు.