ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వేదాంతం బాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పదకొండు రోజులుగా సమ్మె బాట పట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీకి చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ఆత్మహాత్యకు పాల్పడి తనువు చాలించారు.
దీనిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ” తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది సమ్మె శాంతిపూర్వకంగా చేసుకోవాలి. ఎలాంటి ప్రాణత్యాగాలకు పాల్పడకూడదు. వాళ్లమీద కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఏది ఏమైన కానీ బ్రతికి ఉండి తమ తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలి. ప్రభుత్వంపై పోరాడాలి అని సూచించారు.
దీనిపై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికార ఇతర పార్టీల నేతల విరుచుకుపడుతున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఏనాడు ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు. సమస్యలను పరిష్కరించాలి.
తమ డిమాండ్లను నెరవేర్చాలని ధర్నాలు,రాస్తోరోకులు చేసిన అంగన్ వాడీ,రైతన్నలపై కాల్పులు, పోలీసులతో లాఠీ దెబ్బలు కొట్టించిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శిస్తున్నారు. మరోవైపు నెటిజన్లు అయితే రాజకీకీయాలను వదిలి చంద్రబాబు వేదాంతం బాట పట్టారు అని సెటైర్లు వేస్తోన్నారు.