Home / NATIONAL / సుప్రీం కోర్టుకు చేరిన మహా రాజకీయం

సుప్రీం కోర్టుకు చేరిన మహా రాజకీయం

మహారాష్ట్ర రాజకీయం ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ 105 స్థానాలను సాధించింది. మిత్రపక్షమైన శివసేన 56స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇకపోతే ఎన్సీపీ 54,కాంగ్రెస్ 44,ఇతరులు 26 స్థానాల్లో గెలుపొందడంతో ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో గవర్నర్ భగత్ కోశ్యారీ బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించిన కానీ ఉపయోగం లేకపోయింది.అయితే శివసేనను మాత్రం ఇరవై నాలుగంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకురావాలని ఆదేశించారు గవర్నర్. దీంతో మహారాష్ట్ర రాజకీయం ఆఖరికి సుప్రీంకోర్టుకు చేరింది. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తక్కువ సమయం ఇవ్వడంపై శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్ బీజేపీకి 48 గంటల సమయం ఇచ్చారు. మాకు మాత్రం 24 గంటల సమయం ఇవ్వడంపై ఆపార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 24 గంటలు గడువు ఇవ్వాలని గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిసి విన్నవించినప్పటికీ ఆయన పట్టించుకోలేదని శివసేన ఈ సందర్భంగా ఆరోపించింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat