శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడి ఎన్నికల పర్వం ముగిసింది. శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడిగా గొటబయ రాజపక్సె ఎన్నికైనట్లు ఈ రోజు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సరళి స్పష్టం చేస్తుంది. ఈ రోజు ఆదివారం ఉదయం నుంచి మొదలైన ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి గొటబయ రాజపక్స లీడ్ లో ఉన్నారు.
గొటబయ రాజపక్సె శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద్ర పక్సె కు స్వయనా సోదరుడు.తాజా దేశ అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్సె ఎన్నికల్లో ఘనవిజయం సాధించినట్లు ఆయన అధికార ప్రతినిధి కెహేలియా పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో తమకు 53-54% ఓట్లు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.అయితే ఇటీవల ఈ దేశ రాజధాని నగరం కొలంబోలో జరిగిన ఉగ్రదాడి నేపధ్యంలో ప్రస్తుత ప్రభుత్వపక్షానికి లంక ప్రజలు వ్యతిరేకత తెలిపి రాజపక్సెకు మద్దతు ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు