40ఏళ్ళు రాజకీయం అని చెప్పుకునే చంద్రబాబు చేసిన అన్యాయాలు, అక్రమాలకు ఈ ఎన్నికల్లు ఓట్ల రూపంలో ప్రజలు బుద్ధి చెప్పారు. ఓడిపోవడం ఒకటి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఓడిపోయాక చంద్రబాబుకి అసలు సమస్య మొదలయింది. ఆ పార్టీ ముఖ్య నేతల నుండి చిన్న నేతల వరకు అందరు పార్టీకి దూరం అయిపోతున్నారు. గెలిచిన వారు కూడా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నారు. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయానికి వస్తే ఇది టీడీపీ కి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఇక ఈ విషయంపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి “వల్లభనేని వంశీ వదిలిన సవాళ్లకు తెలుగుదేశం పార్టీ జవాబిచ్చే పరిస్థితిలో ఉందా? మాలోకం ఏదో అన్నాడు కాని ఎవరూ పట్టించుకోలేదు. మునిగిపోయే పార్టీ అని అందరికీ అర్థమైంది. చివరకు తండ్రీకొడుకు, తోక పార్టీ దత్తపుత్రుడు మాత్రమే మిగులుతారు. ఎల్లో మీడియా కూడా షాక్ నుంచి తేరుకోనట్టుంది” అని ఎద్దేవా చేసారు.
