ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ సీఎం ,ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీ పార్వతి ప్రస్తుతం వైసీపీ పార్టీ తరపున రాజకీయాల్లో ఉన్న సంగతి విదితమే. అయితే లక్ష్మీ పార్వతి త్వరలోనే వెండితెరపై కన్పించనున్నారా..?. ఇప్పటివరకు రాజకీయంలో ఉన్న లక్ష్మీ పార్వతి త్వరలోనే ముఖానికి రంగు వేసుకోనున్నారా..?.
అంటే అవును అనే అంటున్నారు `ఢమరుకం` శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `రాగల 24 గంటల్లో కీలక పాత్రలో నటించిన ముస్కాన్ ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాకు సంబంధించిన విశేషాలను తెలుపుతూ చెప్పారు.
శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలంగాణ నేపథ్యం ఉన్న `రాధాకృష్ణ` చిత్రంలో ముస్కాన్ నటిస్తుంది.దీనిపై మాట్లాడుతూ ఇందులో లక్ష్మీపార్వతి కీలక పాత్రలో నటించారు. లక్ష్మీపార్వతితో కలిసి నటించడం తనకెంతో హ్యాపీగా అనిపించిందని ముస్కాన్ ఈ సందర్భంగా తెలియజేసింది.