ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే దిమ్మతిరిగే షాకిచ్చాడు.
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్దా,బీజేపీ ప్రధాన కార్యదర్శి అయిన రామ్ మాధవ్ ల సమక్షంలో ఆయన తన కుమార్తెతో కల్సి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ కూడా బీజేపీలో చేరారు.1994 నుంచి రెండు సార్లు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.