వినేవాళ్లు అమాయకులయితే చెప్పేవారు జగన్ గారు అన్నట్లుంది పరిస్థితి అంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి లోకేశ్. ప్రభుత్వం లోటు లో ఉంది, అడుగడుగునా అప్పులే చూపారని టిడిపిపై విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు తమ కార్యకర్తలకు సెల్ ఫోన్లు కొనడానికి 233 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు.
“గ్రామ వాలంటీర్లు అని పేరు మార్చిన వైకాపా కార్యకర్తల కోసం ఫోన్లు కొంటూ రివర్స్ టెండర్ లో రూ.83 కోట్లు ఆదా అంటూ చెవిలో క్యాబేజీ పెట్టారు జగన్ గారు. వైకాపా ప్రభుత్వం టెండర్లు పిలిస్తే, రెండు సార్లూ ఒకే కంపెనీ టెండర్ వేసింది.ఈ స్కీంలో రూ.233 కోట్ల ప్రజాధనానికి జగన్ గారు టెండర్ పెట్టడం తప్ప రివర్స్ టెండరింగ్ ఎక్కడ ఉంది? ఇకపోతే జగన్ గారి పారదర్శకత ప్రకారం రూ.100కోట్లు దాటిన టెండర్లకు జ్యూడిషయల్ ప్రివ్యూ జరగాలి. మరి ఫోన్ల టెండర్లను ప్రివ్యూకు పంపలేదే? అంటే జే ట్యాక్స్ కడితే ప్రివ్యూ ఉండదా జగన్ గారు?
గ్రామ వాలంటీర్లు అన్న పేరుతో నియమించిన వైసీపీ కార్యకర్తల కోసం ఫోన్లు కొంటూ.. రివర్స్ టెండరింగ్లో 83 కోట్ల రూపాయలు ఆదా అంటూ జగన్ అందరి చెవుల్లో క్యాబేజీ పెట్టారని లోకేశ్ సెటైర్లు వేశారు. జగన్ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే, రెండు సార్లూ ఒకే కంపెనీ టెండర్ దాఖలు చేసిందని, అందులో మర్మమేంటని లోకేశ్ ప్రశ్నించారు.”