తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ తరపున నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన ధర్మపురి అరవింద్ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవితపై గెలుపొందిన సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఎంపీ అరవింద్ తో సహా ఆ పార్టీకి చెందిన జాతీయ నాయకులు అఖరికీ మోదీతో సహ అందరూ తెలంగాణకు పసుపుబోర్డును ఇస్తాము.
అది నిజామాబాద్ లోనే పెడతాము అని హామీచ్చారు. దీంతో ప్రజలు నమ్మి అరవింద్ ను గెలిపించారు. ఆ తర్వాత తాజాగా ఎంపీ అరవింద్ మీడియాకిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ”అరవింద్ గట్టి నెగోషియేటర్ అన్న విషయం నిరూపిస్తాను. పసుపు దిగుమతి నిలిపేయాలని కోరాం. ఇందుకు కేంద్రం సానుకూలంగా ఉంది.
పసుపు జాతీయ స్థాయిలో సాగు చేసే పంటకాదు. అయినా సరే పసుపు పంటకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.బోర్డు అనేది గతంలోని ముచ్చట అని తేల్చి చెప్పారు. దీనిపై నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల అప్పుడు అరవింద్ మాట్లాడిన వీడియో.. నిన్న మాట్లాడిన వీడియోను జతపరుస్తూ
“పసుపు బోర్డు కాదు అంతకు మించినది అంటే
జీన్ ప్యాంట్ కాదు అంతకు మించిన లాగే ఉంటుంది,
మొకాలుకి బోడిగుండుకు లింక్ పెట్టినట్టుంది ని ముచ్చట ,,,
పసుపు బోర్డు సంగతి మాట్లాడు వ్య అంటే అంబాసిడార్లు టయోటా కార్లు అంటవేంది ,,,,,
మాట తప్పడం మాకు అలవాటేగా..
2014ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అన్నాము..
2014ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదాకు మించి( ప్రత్యేక ప్యాకేజీ)ప్రయోజనాలు ఇస్తామని అంటున్నాము
..
2019ఎన్నికల్లో తెలంగాణకు పసుపుబోర్డు ఇస్తామని అన్నాము
2019ఎన్నికల తర్వాత పసుపు బోర్డుకు మించి ప్రయోజనాలు ఇస్తామని అంటున్నాము
అని సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు..