ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా రాజధాని విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. మొన్న అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చేసిన ప్రకటనతో ప్రత్యర్ధులు సైత్యం జగన్ కే సపోర్ట్ ఇస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని పెద్ద నాయకులు సైతం వత్తాసు పలుకుతున్నారు. అయితే గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు హయంలో అమరావతిని రాజధానిగా చెయ్యాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఒక్క ప్రపోజల్ మాత్రమే జరిగిందని బయటఅందరు భావించారు. కాని అది ముందుగానే ఫిక్స్ అయ్యారని ఈ మేరకు చంద్రబాబు బ్యాచ్ అక్కడ పొలాలు అన్ని కబ్జాలు చేయడం స్టార్ట్ చేయడంతోనే అందరికి అర్ధమయింది. దీనిపై ఘాటుగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న వారంతా అమరావతిని అధికారికంగా ప్రకటించకముందే చంద్రబాబు బంధువులు, బినామీలు, పచ్చ మాఫియా వేల ఎకరాలు ఎలా కొన్నారో అర్థం చేసుకోవాలి. రాజధాని వస్తుందని అందరికీ ఒకే రోజు కల వచ్చిందా? మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేది జగన్ గారి ఆకాంక్ష” అని అన్నారు.
