Home / SLIDER / ఎంపీ అర్వింద్ ఇజ్జత్ తీసిన కేంద్ర మంత్రి

ఎంపీ అర్వింద్ ఇజ్జత్ తీసిన కేంద్ర మంత్రి

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొంది పార్లమెంట్లో అడుగుపెట్టిన ధర్మపురి అర్వింద్ గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ.. అవాస్తవాలను మీడియా ముందు చెబుతూ వస్తున్నారు.

తాజాగా ఎంపీ అర్వింద్ పార్లమెంట్ లో మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ పథకాల్లో అవినీతి జరుగుతుంది. అందుకే ఈ పథకాలను ఆపేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

దీనికి సమాధానంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ లాంటి పథకాల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగడం లేదు. ఆధార్ సంబంధితమైన ఆ పథకాల్లో అసలు అవినీతి అక్రమాలు జరిగే ప్రసక్తే లేదు అని లిఖిత పూర్వకంగా సమాధానమివ్వడంతో అవాక్కవ్వడం అర్వింద్ వంతైంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat