కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా అమెరికాలో చిక్కుకుపోయారు. వ్యక్తిగత సెలవుపై సునీల్ ఆరోరా మార్చి 7న అమెరికా వెళ్లారు.
ఏప్రిల్ 4వ తేదీన ఇండియాకు ఆరోరా తిరుగు ప్రయాణం కావాల్సి ఉండే. కానీ కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మార్చి 23న కేంద్ర ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో సునీల్ ఆరోరా అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తనతో పాటు పలువురు విమానాల రాకపోకల కోసం ఎదురుచూస్తున్నారని ఆరోరా పేర్కొన్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు అశోక్ లవాసా, సుశీల్ చంద్రతో సునీల్ ఆరోరాతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.