తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఛలో’, ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయిన రష్మికా మందన్నా ఇప్పుడు తమిళ తెరపై కూడా కనిపించబోతున్నారు.
కార్తీ సరసన ‘సుల్తాన్’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు రష్మిక. ఈ సినిమా విడుదల కాకముందే తమిళంలో ఓ బంపర్ ఆఫర్ కొట్టేశారని టాక్. కోలీవుడ్లో తిరుగులేని మాస్ హీరో అనిపించుకున్న విజయ్ 65వ సినిమాలో రష్మికా మందన్నా కథానాయికగా నటించనున్నారట.
పూజా హెగ్డే, కీర్తీ సురేష్.. ఇలా పలువురి తారల పేర్లు వినిపించినా ఫైనల్లీ ఈ అవకాశం రష్మికాని వరించిందని కోలీవుడ్ టాక్.