ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ (కోవిడ్ 19) విజృంభణ కొనసాగుతోంది. రోజూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంట్లో భద్రతా సిబ్బందికి కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది. పుత్తూరులో నారాయణ స్వామి నివాసం వద్ద పహారా కాస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
దీంతో నారాయణ స్వామి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయించగా.. నెగెటివ్గా తేలింది. దీంతో డిప్యూటీ సీఎం ఇంట్లో వారు ఊపిరిపీల్చుకున్నారు.