తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,286 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే 391, రంగారెడ్డి జిల్లాలో 121 నిర్ధారణ అయ్యాయి.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 68,946 కేసులు నిర్ధారణ కాగా, ఇందులో 18,708 యాక్టివ్ కేసులు ఉండగా, 49,675 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 12 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 563కు చేరింది.
కాగా, ఐసోలేషన్లో 11,935 మంది చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షలు 5లక్షలు దాటాయి. గడిచిన 24గంటల్లో 13,787 టెస్టులు చేయగా, మొత్తం 5,01,025 మందికి కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో 72 శాతం రికవరీ రేటు నమోదు చేసిందని ఆరోగ్యశాఖ పేర్కొంది.