ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం నెలకొన్నది.మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ మరణించారు.
గత నెల రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖలోని ఆసుపత్రిలోచికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
మంత్రి తల్లి మరణ వార్త విన్న పలువురు రాజకీయ ప్రముఖులు బొత్స కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.