Home / SLIDER / తెలంగాణలో కొత్తగా 2,479కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,479కరోనా కేసులు

గడిచిన 24గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,479 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,47,642కు చేరాయి. తాజాగా వైరస్‌తో 10 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 916కు చేరింది.

తాజాగా వైరస్‌ నుంచి 2,485 మంది వైరస్‌ నుంచి కొలుకోగా, మొత్తం 1,15,072 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,654 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. మరో 24,741 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.62శాతం ఉండగా, దేశంలో 1.69శాతంగా ఉందని చెప్పింది. అలాగే రికవరీ రేటు 77.9శాతంగా ఉందని పేర్కొంది.

మంగళవారం ఒకే రోజు 62,649 శాంపిల్స్‌ పరీక్షించగా.. ఇప్పటి వరకు 18,90,554 నమూనాలను పరిశీలించినట్లు తెలిపింది. ఇంకా 2,430 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, పది లక్షల జనాభాకు 50,922 మందికి టెస్టులు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.

తాజాగా నమోదైన కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 322 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 188, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 183, వరంగల్‌ అర్బన్‌లో 124, కరీంనగర్‌లో 120, నల్గొండలో 108, నిజామాబాద్‌లో 101 అత్యధికంగా కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat