తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రో సేవలు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి.
హెచ్ఎంఆర్ బుధవారం మూడు కారిడార్లలో రైళ్లు నడిపింది. మొత్తం 680 ట్రిప్పులు నడుపగా, 31 వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది.
ప్రతి స్టేషన్లో అధికారులు కొవిడ్ జాగ్రత్తలను తీసుకున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే ప్రయాణికులను అనుమతించారు.
అయితే ప్రజల్లో నెలకొన్న కొవిడ్ భయం..వర్క్ ఫ్రం హోం తదితర కారణాలతో రద్దీ అంతంత మాత్రంగానే కనిపించింది.