మీరు జియో సిమ్ వాడుతున్నారా..?. అందులో పోస్టు పెయిడ్ వాడాలనే ఆరాటం కానీ ఆలోచన కానీ ఉందా..?. అయితే రిలయన్స్ జియో టెలికాం రంగంలో మరో వినూత్న యుద్ధానికి తెర తీసింది. ఇతర నెట్ వర్క్ ల నుండి జియో మొబైల్ నెట్ వర్క్ కు మారే పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు సెక్యూరిటీ ఫీజు డిపాజిట్ ను రద్ధు చేస్తున్నట్లు జియో ప్రకటించింది.
ప్రస్తుతం ఉన్న తమ పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు ఎలాంటి రుణపరిమితి ఉంటుందో అదే పరిమితి ఇతర నెట్ వర్క్ ల నుండి కొత్తగా తమ నెట్ వర్క్ లో చేరే ఖాతాదారులకు ఉంటుందని తెలిపింది.
అయితే జియో ‘పోస్ట్పెయిడ్ప్లస్’ ప్లాన్స్లో చేరే ఖాతాదారులకు కంపెనీ ఇప్పటికే 500 జీబీ వరకు డేటా అందిస్తోంది. ఆ నెల్లో మిగిలిన డేటానూ ఖాతాదారులు మరుసటి నెలకూ బదిలీ చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో మరే మొబైల్ నెట్వర్క్ పోస్ట్ పెయిడ్ ఖాతా దారులకు ఇలాంటి సదుపాయం కల్పించడం లేదు.