ఐపీఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బెంగళూరు నిర్దేశించిన 146 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో చెన్నై ఏ దశలోనూ తడబడలేదు.
మరోవైపు, ఫీల్డింగ్ లోపాలు బెంగళూరు పుట్టిముంచాయి. ఫీల్డింగ్ వైఫల్యం మ్యాచ్ మొత్తం కనిపించింది. ఇక, చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. 51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో65 పరుగులు చేయగా, డుప్లెసిస్ 13 బంతుల్లో 25, అంబటి రాయుడు 27 బంతుల్లో 39 పరుగులు చేశారు. కెప్టెన్ ధోనీ 21 బంతుల్లో 19 పరుగులు చేశాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కోహ్లీ 50, డివిలియర్స్ 39, పడిక్కల్ 22 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో చెన్నై విజయం సాధించినప్పటికీ దాని స్థానంలో మాత్రం ఎటువంటి మార్పు లేకపోగా, బెంగళూరును మాత్రం ప్రస్తుతానికి ప్లే ఆఫ్కు చేరకుండా అడ్డుకుంది.