Home / SLIDER / బెంగళూరుపై చెన్నై ఘన విజయం

బెంగళూరుపై చెన్నై ఘన విజయం

ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బెంగళూరు నిర్దేశించిన 146 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో చెన్నై ఏ దశలోనూ తడబడలేదు.

మరోవైపు, ఫీల్డింగ్ లోపాలు బెంగళూరు పుట్టిముంచాయి. ఫీల్డింగ్ వైఫల్యం మ్యాచ్ మొత్తం కనిపించింది. ఇక, చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. 51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో65 పరుగులు చేయగా, డుప్లెసిస్ 13 బంతుల్లో 25, అంబటి రాయుడు 27 బంతుల్లో 39 పరుగులు చేశారు. కెప్టెన్ ధోనీ 21 బంతుల్లో 19 పరుగులు చేశాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కోహ్లీ 50, డివిలియర్స్ 39, పడిక్కల్ 22 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించినప్పటికీ దాని స్థానంలో మాత్రం ఎటువంటి మార్పు లేకపోగా, బెంగళూరును మాత్రం ప్రస్తుతానికి ప్లే ఆఫ్‌కు చేరకుండా అడ్డుకుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat