Home / NATIONAL / దేశంలో తగ్గని కరోనా కేసులు

దేశంలో తగ్గని కరోనా కేసులు

ప్రస్తుతం దేశంలో గడిచిన 24 గంటల్లో మొత్తం 15,968 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. తాజాగా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,04,95,147కు పెరిగింది.

కొత్తగా 17,817 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 1,01,29,111 కోలుకున్నారని తెలిపింది. మరో 202 మంది మహమ్మారి బారినపడి మృత్యువాత పడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,51,529కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 2,14,507 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. దేశంలో మంగళవారం ఒకే రోజు 8,36,227 నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ చెప్పింది. ఇప్పటి వరకు 18,34,89,114 శాంపిల్స్‌ టెస్ట్‌ చేసినట్లు వివరించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat